బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. ఈ సందర్బంగాఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో  ముంబైలో నిర్వహించిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాజరయ్యారు. కాగా టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి కల్పించారు. అతని స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్న జట్టునే కొనసాగించినట్లు సెలక్షన్‌ కమిటీ పేర్కొంది


దేశవాళి క్రికెట్లో దుమ్మురేపిన ఆటగాళ్లకు అత్యధిక ప్రాధాన్యం కల్పించినట్లు కమిటీ తెలిపింది. విజయ్‌ హజారే ట్రోపిలో 212 పరుగులతో సత్తా చాటిన సంజు శామ్సన్‌కు 4 ఏళ్ల తర్వాత మళ్లీ పిలుపొచ్చింది. అతను చివరగా 2015లో జింబ్వాబేలో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. వెన్నుముక నొప్పితో భాదపడుతూ ఇటీవలే సర్జరీ చేయింరుకొన్న హార్ధిక్‌ పాండ్యా స్థానంలో ముంబయి ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేను ఎంపిక చేశారు. ముంబయి మీడియం పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ అనూహ్యంగా టీ20 జట్టులో చోటు సంపాదించడం విశేషం. నవదీప్‌ సైనీ స్థానంలో శార్దుల్‌ను ఎంపిక చేసినట్లు కమిటీ పేర్కొంది.  


కృనాల్‌ పాండ్యా తన స్థానాన్ని నిలుపుకోగా, మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన యజువేంద్ర చాహల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. ఇక కుల్దీప్‌ యాదవ్‌ టెస్టు జట్టులో స్థానం నిలుపుకున్నా టీ20లో మాత్రం చోటు దక్కలేదు. అయితే టీ20 జట్టులో లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌, ఆల్‌రౌండర్‌ వాషిగ్టంన్‌ సుందర్‌, పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌లు తమ స్థానాలు కాపాడుకున్నారు. 


టీ20 జట్టు : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ శామ్సన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌),  కృనాల్‌ పాండ్యా,యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, వాషిగ్టంన్‌ సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, శివమ్‌ దేబే, శార్దుల్‌ ఠాకూర్‌










టెస్టు జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, వయాంక్‌ అగర్వాల్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్దిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మాన్‌గిల్‌, రిషబ్‌ పంత్‌